కార్పొరేట్ ఫలితాల సీజన్ దాదాపు ముగిసింది. ఒక్క ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ మినహా మార్కెట్ అంచనాలకు మించిన ఫలితాలు వెల్లడించిన కంపెనీ ఏదీ లేదు. అలాగే మార్కెట్ను తీవ్ర నిరుత్సాహానికి లోనుచేసిన కంపెనీ కూడా లేదు. అందుకే ఆర్థిక ఫలితాల ప్రభావం గత ఆరువారాల నుంచి సూచీలపై పెద్దగా పడలేదు.
అంతర్జాతీయంగా కొనసాగుతున్న పాజిటివ్ ట్రెండ్, క్రూడ్ ధరల తగ్గుదల వంటి అంశాలు భారత్ సూచీలను ముందుకు నడిపిస్తున్నాయి. కానీ గత శుక్రవారం నాటకీయంగా ముడిచమురు, బంగారం హఠాత్తుగా కనిష్టస్థాయి నుంచి పెద్ద ర్యాలీ జరిపాయి. ఇదేరోజున డాలరుతో రూపాయి మారకపు విలువ నెలరోజుల కనిష్టస్థాయికి పడిపోయింది. ఒకవైపు కమోడిటీ ధరలు పెరగడం, మరోవైపు రూపాయి క్షీణించడం భారత్ స్టాక్ మార్కెట్ను ఆందోళనపర్చే అంశం. ఇక సూచీల సాంకేతికాంశాలకొస్తే...
సెన్సెక్స్ సాంకేతికాంశాలు...
నవంబర్14తో ముగిసిన వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గుల కు లోనై చివరకు 28,000 పాయింట్ల శిఖరంపైన స్థిరపడగలిగింది. 28,126 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన సెన్సెక్స్ చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 178 పాయింట్ల లాభంతో 28,047 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం 28,000 స్థాయిపైన నిలదొక్కుకుంటే, క్రమేపీ కొద్దివారాల్లో 28,500-28,600 స్థాయిని అందుకోవొచ్చు.
ఈ శ్రేణిని అందుకునే ముందు, 28,150-28,250 పాయింట్ల శ్రేణి అవరోధాన్ని కల్పించవచ్చు. వచ్చే కొద్దిరోజుల్లో సెన్సెక్స్కు 27,700-27,800 మద్దతుశ్రేణి కీలకం. గత రెండు వారాల నుంచి ఈ మద్దతు సహకరాంతో పలుదఫాలు సూచీ బౌన్స్ అయినందున, ఈ శ్రేణిని కోల్పోతే అక్టోబర్ 31నాటి గ్యాప్అప్స్థాయి 27,440-27,390 శ్రేణి వద్దకు క్షీణించవచ్చు. ఈ మద్దతు శ్రేణి దిగువన ముగిస్తే 27,100-26,900 శ్రేణి వద్దకు తగ్గవచ్చు.
నిఫ్టీ మద్దతు శ్రేణి 8,290-8,320
ఎన్ఎస్ఈ నిఫ్టీ 8,360 పాయింట్ల అవరోధస్థాయిపైన ముగిసిన వెంటనే 8,415 పాయింట్ల గరిష్టస్థాయివరకూ ర్యాలీ జరిపింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 53 పాయింట్ల లాభంతో 8,390 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ 8,360 స్థాయిని పరిరక్షించుకోగలిగితే, 8,440-8,470 శ్రేణి వద్దకు ర్యాలీ జరపవచ్చు. అటుతర్వాత రానున్న వారాల్లో 8,500-8,550 శ్రేణిని చేరవచ్చు. 8,360 స్థాయి దిగువన రెండు వారాల నుంచి మద్దతు కల్పిస్తున్న 8,290-8,320 పాయింట్ల శ్రేణి నిఫ్టీకి కీలకం. ఈ మద్దతు శ్రేణిని నష్టపోతే మార్కెట్ కరెక్షన్ బాటలోకి మళ్లవొచ్చు. ఆ లోపున క్రమేపీ 8,200-8,180 పాయింట్ల శ్రేణి వద్దకు క్షీణించవచ్చు.
- పి. సత్యప్రసాద్
సెన్సెక్స్ మద్దతు శ్రేణి 27,700-27,800
Published Mon, Nov 17 2014 12:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement