మార్కెట్లోకి శాంసంగ్ కొత్త ట్యాబ్
సాక్షి, న్యూఢిల్లీ : గెలాక్సీ నోట్8, ఫ్రేమ్ టీవీలను లాంచ్ చేసిన అనంతరం ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ ఓ సరికొత్త మిడ్-సెగ్మెంట్ టాబ్లెట్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. గెలాక్సీ ట్యాబ్ ఏ పేరుతో రూ.17,990కు దీన్ని లాంచ్ చేసింది. నేటి నుంచి ఈ టాబ్లెట్ అన్ని స్టోర్లలో అందుబాటులోకి వస్తోంది. నవంబర్ 9 కంటే ముందుగా ఈ టాబ్లెట్ను కొనుగోలు చేస్తే, వన్ టైమ్ ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్ను కూడా ఆఫర్ చేయనున్నట్టు శాంసంగ్ తెలిపింది.
గెలాక్సీ ట్యాబ్ ఏ ఫీచర్లు..
8 అంగుళాల డిస్ప్లే
1.4 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్
2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నట్ స్టోరేజ్
256 జీబీ వరకు విస్తరణ మెమరీ
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
8 ఎంపీ రియర్ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
బిక్స్బీ హోమ్ను ఇది కలిగి ఉంది.