ఉబెర్ ఇండియా ప్రెసిడెంట్ అమిత్ జైన్
న్యూఢిల్లీ : ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ భారత్లో కార్యకలాపాలు భారీ ఎత్తున విస్తరించడానికి ప్రణాళికలు వేస్తోంది. ఇందుకోసం వచ్చే 6-9 నెలల వ్యవధిలో భారత్లో దాదాపు 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ.6,400 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఉబె ర్ ఇండియా ప్రెసిడెంట్ అమిత్ జైన్ చెప్పారు. ఒకవైపు వివిధ కారణాలతో నిషేధాలు విధించడం వంటి వివాదాలు, మరోవైపు ఓలా వంటి స్థానిక సంస్థల నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో ఉబెర్ భారీ పెట్టుబడి ప్రణాళికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తమ ప్రాధాన్య మార్కెట్లలో భారత్ కూడా ఒకటని, అందుకోసమే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నామని ఆయన తెలియజేశారు.
కార్యకలాపాలు మెరుగుపర్చుకోవడానికి, మరిన్ని నగరాలకు విస్తరించడానికి ఈ నిధులు వినియోగిస్తామన్నారు. ఈ ఇన్వెస్ట్మెంట్తో రాబోయే ఆరు-తొమ్మిది నెలల్లో రోజుకి 10 లక్షల పైగా ట్రిప్ల స్థాయిని సాధించగలమని అంచనా వేస్తున్నట్లు అమిత్ జైన్ తెలిపారు. అమెరికా తర్వాత తమకు అతి పెద్ద మార్కెట్గా భారత్ నిలుస్తోందన్నారు. వచ్చే ఐదేళ్లలో హైదరాబాద్లో సుమారు 50 మిలియన్ డాలర్ల పెట్టుబడితో అంతర్జాతీయ కార్యాలయం ప్రారంభించనున్నట్లు ఉబెర్ ఇటీవలే ప్రకటించింది. అంతర్జాతీయ కార్యకలాపాల్లో తొలిసారిగా హైదరాబాద్లో నగదు చెల్లింపులను కూడా అనుమతించాలని నిర్ణయం తీసుకుంది.
భారత్లో రూ. 6,400 కోట్ల పెట్టుబడులు
Published Sat, Aug 1 2015 12:50 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement