30 రోజుల్లోనే పన్ను ఫిర్యాదుల పరిష్కారం | Return of debit card, ATM fee worry cash-strapped people | Sakshi
Sakshi News home page

30 రోజుల్లోనే పన్ను ఫిర్యాదుల పరిష్కారం

Jan 4 2017 1:11 AM | Updated on Mar 19 2019 6:59 PM

ఐటీ రీఫండ్‌ తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు అందిన 30 రోజుల్లోగానే అధికారులు పరిష్కరించాలని ఆదాయ పన్ను విభాగం ఆదేశించింది...

న్యూఢిల్లీ: ఐటీ రీఫండ్‌ తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు అందిన 30 రోజుల్లోగానే అధికారులు పరిష్కరించాలని ఆదాయ పన్ను విభాగం ఆదేశించింది. రీఫండ్‌లు, పాన్‌ కార్డు లేదా ఇతరత్రా ఆదాయ పన్ను సంబంధ ఫిర్యాదులు ఏ స్థాయిలోనూ 30 రోజులకు మించి పెండింగ్‌లో ఉండకూడదంటూ పేర్కొంది.

కొత్తగా ఏర్పాటైన డైరెక్టరేట్‌ ఆఫ్‌ ట్యాక్స్‌ పేయర్‌ సర్వీసెస్‌ (డీటీపీఎస్‌) ఈ మేరకు ఐటీ ప్రాంతీయ కార్యాలయాల అధిపతులకు సూచించింది. ఆయా ఫిర్యాదులకు సంబంధించిన అధికారిని గుర్తించలేకపోవడం, తాజాగా వచ్చిన సూచనల గురించి అవగాహన లేకపోవడమే ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యానికి కారణమవుతున్నాయని పేర్కొంది. ఒకవేళ సీబీడీటీ ఆదేశించిన అథారిటీ పరిధిలోకి రాని అంశమైన పక్షంలో .. దాన్ని అయిదు రోజుల్లోగా వెనక్కి పంపాలని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement