
రెండవ జాబితా: 40 కంపెనీలకు షాక్!
కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ల నుంచి మొండిబకాయిలను రాబట్టుకునే ప్రక్రియలో భాగంగా మరో జాబితాను సిద్ధం చేసింది.
న్యూఢిల్లీ: భారీ రుణ ఎగవేతదారులకు షాకిచ్చే దిశగా కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేగంగా కదులుతోంది. కార్పొరేట్ల నుంచి మొండిబకాయిలను రాబట్టుకునే ప్రక్రియలో భాగంగా ఆర్బీఐ మరో జాబితాను సిద్ధం చేసింది. దాదాపు 30-40 కంపెనీలతో కూడిన రెండవ జాబితాను త్వరలోనే విడుదల చేయనుంది. ఇందులో భాగంగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో కేసు దాఖలు చేయనుంది.
ఎకానమిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఈ సెప్టెంబర్ లో ఈ రెండవ జాబితాను బహిర్గతం చేయనుందని తెలుస్తోంది. వీటిలో ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్ సెక్టార్ కంపెనీలు ఉండనున్నాయి. ఉత్తమ్ గాల్వా, వీడియోకాన్, విసా స్టీల్, కాస్టెక్స్ టెక్నాలజీస్ , జెఎస్పీఎల్ తదితర కంపెనీలు ఇందులో ఉండనున్నాయి.
కాగా ఈ వార్తలపై స్పందించడానికి ఉత్తం గాల్వా, వీడియో కాన్ కంపెనీ ప్రతినిధులు నిరాకరించారని ఎకానమిక్స్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. ఈ అంచనాలపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.