ఎంఅండ్‌ఎం లాభంలో 24 శాతం వృద్ధి 

Q2 Results: M&M Profit Jumps 26%, Beats Estimates - Sakshi

క్యూ2లో రూ.1,649 కోట్లు

తగ్గిన ట్రాక్టర్ల అమ్మకాలు   

న్యూఢిల్లీ: ఆటో దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా స్టాండలోన్‌ ప్రాతిపదికన ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ త్రైమాసికంలో కంపెనీ లాభం 24 శాతం వృద్ధితో రూ.1,649 కోట్లుగా నమోదైంది. ఆదాయం రూ.13,835 కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.1,331 కోట్లు, ఆదాయం రూ.12,745 కోట్లుగా ఉన్నాయి.

రెండో త్రైమాసికంలో వాహన అమ్మకాలు 1,41,163 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో వాహన అమ్మకాలు 1,29,754 యూనిట్లు కావడం గమనార్హం. ప్రధానంగా ట్రాక్టర్ల అమ్మకాలు 5 శాతం తగ్గిపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో 76,984 ట్రాక్టర్లను విక్రయిస్తే... అవి తాజాగా ముగిసిన త్రైమాసికంలో 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top