సైబర్‌ మోసం.. ఒక్కో యూజర్‌ నష్టం రూ.32,400 | Internet users lose $476 on average per cyber attack, says Kaspersky | Sakshi
Sakshi News home page

సైబర్‌ మోసం.. ఒక్కో యూజర్‌ నష్టం రూ.32,400

Jan 28 2017 1:53 AM | Updated on Sep 5 2017 2:16 AM

సైబర్‌ మోసం.. ఒక్కో యూజర్‌ నష్టం రూ.32,400

సైబర్‌ మోసం.. ఒక్కో యూజర్‌ నష్టం రూ.32,400

ఇంటర్నెట్‌ వినియోగదారులు సైబర్‌ దాడుల కారణంగా సగటున రూ.32,400 నష్టపోయారని సాఫ్ట్‌వేర్‌ సెక్యూరిటీ సంస్థ క్యాస్పరెస్కి తెలిపింది.

క్యాస్పర్‌స్కీ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: ఇంటర్నెట్‌ వినియోగదారులు సైబర్‌ దాడుల కారణంగా సగటున రూ.32,400 నష్టపోయారని సాఫ్ట్‌వేర్‌ సెక్యూరిటీ సంస్థ క్యాస్పరెస్కి తెలిపింది. సైబర్‌ దాడుల్లో సొమ్ములు పోగొట్టుకున్నవాళ్లలో 52 శాతం మంది మాత్రమే తమ సొమ్ముల్లో కొంచెమైనా వెనక్కి పొందగలిగారని ఈ సంస్థ రూపొందించిన తాజా నివేదిక పేర్కొంది. ఇంటర్నెట్‌లో ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని,  తమ సొమ్ములను తమను సైబర్‌ మోసాల నుంచి కాపాడుకోవడానికి ఇంటర్నెట్‌ యూజర్లు ఇంటర్నెట్‌ సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేసుకోవాలంటున్న ఈ నివేదిక పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాలు..

ఆన్‌లైన్‌ ఆర్థిక మోసాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఆన్‌లైన్‌ మోసాలు, హ్యాకింగ్‌  తదితరాలు ఏడాదికి వంద కోట్లకు పైగా జరుగుతున్నాయి.
మోసాలకు గురైన వాళ్లలో అధిక భాగం ఫిర్యాదు చేయకుండానే మిన్నకుండిపోతున్నారు.
సగటున ఒక్కో ఇంటర్నెట్‌ వినియోగదారుడి నష్టం  రూ.32,400 గా ఉంది.
సర్వేలో పాల్గొన్న ప్రతి పదిమందిలో కనీసం ఒకరు 5,000 డాలర్లు నష్టపోయారు.
ఆన్‌లైన్‌లో ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నామని చెప్పిన వారి సంఖ్య 81 శాతంగా ఉంది.
ఆర్థిక సంబంధిత డేటాను అనుసంధానించే డివైస్‌ల్లో స్టోర్‌ చేసుకుంటామని చెప్పిన వారి సంఖ్య 44 శాతంగా ఉంది.
ఈ డివైస్‌లను తగిన రక్షణ ఏర్పాట్లు చేసుకుం టామని చెప్పిన వారి సంఖ్య 60%గా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement