నేడు వైఎస్సార్‌సీఎల్పీ పర్యటన | Ysrcplp tour to be started from today | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్సార్‌సీఎల్పీ పర్యటన

Feb 23 2015 1:11 AM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం వైసీపీ శాసనసభాపక్షం రాజధాని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించనుంది.

సాక్షి, గుంటూరు/గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం వైసీపీ శాసనసభాపక్షం రాజధాని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించనుంది. అక్కడి రైతులు, కౌలురైతులు, కూలీలు, వ్యవసాయాధారిత కుటుంబాల సాధకబాధకాలు తెలుసుకోనుంది. పార్టీ నేతలు జరీబు పొలాల్లో తిరిగి, పచ్చని పంట పొలాలను పరిశీలించి, రైతుల ఆందోళనకు ఆలంబనగా నిలువనున్నారు. అనంతరం రాజధాని గ్రామాల్లో సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించుకుని విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యాలయానికి చేరుకుంటారు. సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్‌ను కలిసి వినతిపత్రం అందజేస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement