చవితి శుభాకాంక్షలు: వైఎస్ జగన్






సాక్షి, హైదరాబాద్ :
ఉభయ తెలుగు రాష్ట్రాలకు అభివృద్ధి పరంగా విఘ్నాలు తొలగిపోయి అన్నీ విజయాలే సిద్ధించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఆయన తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్‌ చేశారు.


తెలుగు ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ... రెండు రాష్ట్రాల ప్రజలందరికీ విజయాలు చేకూర్చాలని మనసారా కోరుకున్నారు. రెండు రాష్ట్రాలకు విఘ్నాలు తొలగిపోయి అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, తెలుగు ప్రజలకు అంతా మంచి జరగాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top