విజయనగరం జిల్లా సాలూరు మండలం జీగ్రామ్లోని జ్యూట్మిల్లు సోమవారం ఉదయం ఆకస్మికంగా లాకౌట్ ప్రకటించింది.
జూట్ మిల్లు లాకౌట్: కార్మికుల ఆందోళన
Feb 29 2016 12:40 PM | Updated on Sep 3 2017 6:42 PM
సాలూరు రూరల్: విజయనగరం జిల్లా సాలూరు మండలం జీగ్రామ్లోని జ్యూట్మిల్లు సోమవారం ఉదయం ఆకస్మికంగా లాకౌట్ ప్రకటించింది. దీంతో కంపెనీలో పనిచేస్తున్న సుమారు 1,550 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఇక్కడ 900 మంది కార్మికులు ట్రైనీలుగా పనిచేస్తున్నారు. వారిలో 600 మందిని రెగ్యులర్ చేయాల్సి ఉంది. ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ యాజమాన్యం ఉన్నట్టుండి లాకౌట్ ప్రకటించడంతో కార్మికులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.
Advertisement
Advertisement