అన్నిటా ఆమె మహిళా దినోత్సవ సందర్భంగా | womens special | Sakshi
Sakshi News home page

అన్నిటా ఆమె మహిళా దినోత్సవ సందర్భంగా

Mar 8 2015 12:45 AM | Updated on Sep 2 2017 10:28 PM

అన్నిటా ఆమె  మహిళా దినోత్సవ సందర్భంగా

అన్నిటా ఆమె మహిళా దినోత్సవ సందర్భంగా

అతివలు నేడు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. చట్ట సభల్లోనూ తమ హవా చాటుకుంటున్నారు.

రాజకీయాల్లో  రాణిస్తున్న మహారాణులు..
పాలనలోనూ తనదైన ముద్ర వేస్తున్న మహిళలు

 
విశాఖపట్నం : అతివలు నేడు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. చట్ట సభల్లోనూ తమ హవా చాటుకుంటున్నారు. జిల్లాలోని 15 అసెంబ్లీ సిగ్మెంట్‌లకు గాను పాడేరు, పాయకరావుపేటల నుంచి మహిళా ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అరకు లోక్‌సభ నుంచి మహిళ ఎన్నికయ్యారు. జిల్లా పరిషత్ పీఠంతో పాటు  రెండు మున్సిపాల్టీలు వారి చేతుల్లోనే ఉన్నాయి. ఇక 925 పంచాయతీల్లో 463 పంచాయితీల్లో పెత్తనం వారిదే. జెడ్పీలో కీలక భూమిక పోషించే 39 జెడ్పీటీసీలతో పాటు 39 ఎంపీపీల్లో సైతం సగం మండలాలు వారి చేతుల్లోనే ఉన్నాయి. 656ఎంపీటీసీ సభ్యుల్లో 328 మంది మహిళా మణులే. ఇక అధికారులు విషయానికొస్తే..జిల్లా వైద్య ఆరోగ్యం, దేవాదాయం, వ్యవసాయ, పర్యాటక, ఐసీడీఎస్, ఉన్నత విద్య, ప్రాధమిక విద్య, ఎస్సీ కార్పొరేషన్‌ల జిల్లా ఉన్నతాధికారుల స్థానాలతో పాటు పోలీస్ శాఖల్లో కూడా కీలకమైన పోస్టుల్లో మహిళలు రాణిస్తున్నారు.  సాఫ్ట్‌వేర్, ఇతర ప్రైవేటు రంగాల్లో 40 శాతం మంది మహిళలు అద్బుతంగా పనిచేస్తూ ఆయా సంస్థల అభ్యున్నతిలో తనదైన ముద్ర వేసుకుంటున్నారు.

రిజర్వేషన్ల పరంగా స్థానిక సంస్థలు,, చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళల్లో కూడా చైతన్యం పెరిగింది. నిన్నమొన్నటివరకు కుటుంబ సభ్యులు..రాజకీయ పార్టీల నేతల చేతుల్లో రబ్బర్‌స్టాంప్‌గా పరిమితమైన మహిళలు నేడు పాలనలో వారి పెత్తనాన్ని పక్కన పెట్టి తమదైన పంథాలో దూసుకెళ్తున్నారు. దీంతో క్రమేపీ పురుషుల కంటే ధీటుగా  అన్నిరంగాల్లోనూ రాణించగలమని తెగేసిచెబుతున్నారు. అధికార పక్షంలో ఉన్నా..ప్రతిపక్షంలో ఉన్నా తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్నా అటు అసెంబ్లీలోనూ.. ఇటు స్థానిక సంస్థల్లోనూ ప్రజాసమస్యలపై గళమెత్తుతున్నారు.

అయినా ఎందుకు వివక్ష..

ఆడశిశువుల సంఖ్య మాత్రం నానాటికి తగ్గిపోతూనే ఉంది. అక్షరాశ్యతా శాతంలో కూడా జిల్లా ఇంకా వెనుకబడే ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 42,90,589 కాగా..పురుషులు.21,38,910 మహిళలు..21,51,679. అంటే పురుషుల కంటే మహిళా జనాభా ఎక్కువ. గత పదేళ్లలో మహిళల పుట్టుక తగ్గిపోతుంది. ఇందుకు తాజాగణాంకాలే ఆధారం. ప్రస్తుతం జిల్లాలోఆరేళ్ల లోపు చిన్నారుల్లో మగశిశువులు..2,30,630 కాగా, ఆడశిశువులు 2,21,583 మంది ఉన్నారు. ప్రతీ వెయ్యి మందికి 960 మంది మాత్రమే మహిళలుంటున్నారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే. జిల్లాలో చదువుకున్న వారిలో కూడా మహిళ అక్షరాస్యతా శాతం చాలా తక్కువగా ఉంది. రాష్ర్టంలో అక్షరాస్యతా శాతం 67.02గా ఉంటే..మన జిల్లాలో 66.91 శాతంగా ఉంది. ఇక వీరిలో పురుషుల అక్షరాస్యతా శాతం 74.56 శాతంగాఉంటే..మహిళల అక్షరాస్యతా శాతం కేవలం 59.34 శాతంగా మాత్రమే ఉంది. పైగా ఇటీవలే ఆడవాళ్లను చదివించాలన్న ఆలోచన తల్లిదండ్రుల్లో కలుగుతుంది.

నగరంలో ఓకే..కానీ పల్లెల్లో..

విశాఖ నగరం,,పరిసర ప్రాంతాల్లో మహిళల అక్షరాస్యతా శాతం మెరుగ్గానే ఉన్నప్పటికీ గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం ఆశించన స్థాయిలో పురోగతి కన్పించడం లేదు. ఆనాటి ఉద్యమాల్లో వేతన సవరణల కోసం ఉద్యమించి మహిళలు విజయాలకు చిహ్నంగా నేడు మహిళా దినోత్సవం చేసుకుంటున్నాం.  నేడు అది ఫ్యాషన్‌గా మారిపోయింది. ముగ్గులు పోటీలు, వ్యాసరచన పోటీలంటూ ప్రతి క్లబ్‌లు, సంఘాలు దినోత్సవం చేసుకోవడం రివాజుగా మారిపోయింది. మహిళలు అన్నీ రంగాల్లో విజయం సాధించాలంటే క్షేత్రస్థాయి వారి జీవితాల్లో చైతన్యం తీసుకురావాలి.

సమాజంలో నేటికీ కొనసాగుతున్న వివక్షతా విషవలయాలు పటాపంచలవ్వాలి. అసంఘటిత రంగంలో పని చేస్తున్న నిరుపేద మహిళలను తీవ్రంగా కుంగదీస్తుంది. ఫలితంగా ఆహారం-ఆరోగ్యస్థితుగతులు పూర్తిగా క్షీణిస్తున్నాయి. ఇప్పటికీ అభద్రత చోటు చేసుకుంది. చీకటిపడితే ఇంటికి చేరే వరకు ఆ తల్లిదండ్రులకు టెన్షన్ తప్పడంలేదు. కుల,వర్గ,జాతి విభేదాలు లేకుండా మహిళల హక్కుల కోసం, మానవాళి సంక్షేమానికి పాలక వర్గాలు అంకిత భావంతో పనిచేయడం లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement