వివాహిత ఆత్మహత్యాయత్నం | woman suicide in ananthpur | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్యాయత్నం

Nov 6 2015 6:31 PM | Updated on Mar 19 2019 6:59 PM

కన్నవారే చంపేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవటం లేదంటూ ఓ వివాహిత ఆత్మహత్యకు యత్నించింది.

అనంతపురం: కన్నవారే చంపేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవటం లేదంటూ ఓ వివాహిత ఆత్మహత్యకు యత్నించింది. అనంతపురం డీఎస్పీ కార్యాలయం వద్ద శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.

రాప్తాడు మండలం తోపుదుర్తి గ్రామానికి చెందిన పెద్దయ్య కుమార్తె వరలక్ష్మి(23)కు విశాఖకు చెందిన వీరనాయుడుతో గత ఏడాది వివాహమైంది. తన భర్తకు వచ్చే జీతంతో జీవనం గడపటం కష్టంగా మారిందని కొన్ని రోజులుగా వరలక్ష్మి తల్లిదండ్రులకు చెబుతోంది. తమకు సాయం చేయాలని కోరుతోంది. తల్లిదండ్రులు ఆమెను ఇంటి నుంచి వెళ్లగొట్టారు.

తల్లిదండ్రులు తనను రెండుసార్లు చంపేందుకు ప్రయత్నించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు పట్టించుకోలేదంటూ రెండు రోజులుగా డీఎస్పీ కలిసేందుకు ప్రయత్నిస్తోంది. వీలుపడకపోవటంతో శుక్రవారం సాయంత్రం అనంతపురంలోని డీఎస్పీ కార్యాలయం వద్ద నిద్రమాత్రలు మింగింది. గమనించిన పోలీసులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమెకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement