హోటల్‌పై విజిలెన్స్‌ దాడి | Vigilance Attack on Hotels in Srikakulam | Sakshi
Sakshi News home page

హోటల్‌పై విజిలెన్స్‌ దాడి

Feb 20 2019 8:04 AM | Updated on Feb 20 2019 8:04 AM

Vigilance Attack on Hotels in Srikakulam - Sakshi

గ్యాస్‌ సిలిండర్లు పట్టుకున్న అధికారులు

శ్రీకాకుళం  ,లావేరు: మండలంలోని సుభద్రాపురం గ్రామంలో ఓ హోటల్‌పై మంగళవారం విజిలెన్స్, రెవెన్యూ అధికారులు దాడి చేశారు. 8 గ్యాస్‌ సిలిండర్లను (ఇంటి అవసరాలకు వినియోగించేవి) సీజ్‌ చేసి, హోటల్‌ యజమాని వెంకటరమణపై 6ఏ కేసు నమోదు చేశారు. విజిలెన్స్‌ ఎస్‌ఐ కిరణ్‌కుమార్, ఆర్‌ఐ ఆర్‌.శ్రీనివాసరావు, వీఆర్వో జగదీష్‌ హోటల్లో తనిఖీలు చేపట్టారు. సీజ్‌ చేసిన గ్యాస్‌ సిలిండర్లను విజిలెన్స్‌ ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌ ఆర్‌ఐ శ్రీనివాసరావుకు అప్పగించారు.

Advertisement
 
Advertisement
Advertisement