గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య | The brutal murder of an unidentified man | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య

Sep 24 2015 1:41 PM | Updated on Aug 24 2018 2:36 PM

గుర్తు తెలియని వ్యక్తి మృత దేహం గుంటూరు జిల్లాలో కలకలం రేపింది.

గుర్తు తెలియని వ్యక్తి మృత దేహం గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. గుంటూరు జిల్లాలో నూజెండ్ల మండలంలోని కొండలరాయునిపాలెం- పువ్వాడ గ్రామాల మధ్య ఉన్న గుండ్లకమ్మ నదిలో గురువారం మధ్యాహ్నం స్థానికులు గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ సీఐ శ్రీనివాసరావు, ఐనవోలు ఎస్సై విజయ్‌చరణ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం మొండెం మాత్రమే ఉంది. కాళ్లు, చేతులు నరికేసి ఉన్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement