ఏలూరు సిటీ : ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియపై స్పష్టత కొరవడింది. వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని నూతనంగా అమలు చేయాలని విద్యాశాఖ భావిస్తుండగా...ఈ విధానంతో టీచర్లు తమ స్వేచ్ఛను కోల్పోతారని ఉపాధ్యాయులు, సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. బదిలీల కౌన్సెలింగ్కు ఇంకా సరైన విధి విధానాలు ఖరారు కాలేదని విద్యాధికారులు స్పష్టం చేస్తున్నారు. బదిలీల ప్రక్రియ ప్రారంభానికి ముందే ఉపాధ్యాయుల రేషనలైజేషన్ పూర్తిచేయాల్సి ఉంది. ఇప్పటికే ఆదర్శ ప్రాథమిక పాఠశాలల పేరుతో కొన్ని ప్రైమరీ స్కూళ్లను మూసివేసేందుకు అధికారులు నివేదికలు సమర్పించారు. ఇవన్నీ పూర్తి చేసేందుకు విద్యాధికారులు కసరత్తు చేస్తున్నారు. క్రమబద్ధీకరణ పేరుతో జిల్లాలో రెండు దశల్లో 189 ప్రాథమిక పాఠశాలలకు, మునిసిపల్ యాజమాన్యంలో 16 స్కూళ్లకు తాళాలు పడనున్నాయి. ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో పాఠశాలల మూసివేతపై ప్రజల నుంచి అభ్యంతరాలు రావటంతో ఈసారికి వెనుకడుగు వేసినట్టు తెలుస్తోంది. ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు మంచిదేనని అయితే స్కూళ్లను మూసివేయకుండా కేరళ తరహాలో అన్ని స్కూళ్లను ఆదర్శ పాఠశాలలుగా అభివృద్ధి చేయాలనే డిమాండ్ వినవస్తోంది.
వెబ్ కౌన్సెలింగ్ వద్దంటున్న టీచర్లు
ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి పాత విధానానికి బదులు కొత్తగా ఎంసెట్ తరహాలో వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈనెల 7న డెమో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ప్రాథమిక విద్య ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు మాత్రం వెబ్ కౌన్సెలింగ్ వద్దంటున్నారు. ఒక్కో టీచర్ 99 ఆప్షన్లను పెట్టుకోవచ్చని, ఇంటి నుంచో, నెట్ సెంటర్ల నుంచో సులువుగా చేయవచ్చని విద్యాధికారులు చెబుతున్నారు. కానీ పాత విధానంలో అయితే ఖాళీలను చూసుకుంటూ తమ అవకాశం వచ్చినప్పుడు బదిలీ స్థానాన్ని ఎంపిక చేసుకోవచ్చని ఉపాధ్యాయులు అంటున్నారు. పైగా భార్యాభర్త, ప్రత్యేక కేటగిరీల్లో ఇబ్బందులు వస్తాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. జిల్లాలో సుమారు నాలుగువేల మంది ఉపాధ్యాయులు బదిలీ కౌన్సెలింగ్లో ఆప్షన్లు పెట్టుకునే అవకాశం ఉంది.
క్రమబద్ధీకరణతో పిల్లలకు కష్టాలే
తొలుత ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ పూర్తి చేసి అనంతరం బదిలీలు చేపడతారు. దీనిలో భాగంగానే 20లోపు పిల్లలున్న పాఠశాలలు, అసలు పిల్లలు లేని స్కూళ్లను మూసివేసి అక్కడి ఉపాధ్యాయులను ఇతర స్కూళ్లకు సర్దుబాటు చేస్తారు. ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేస్తుండటంతో మిగులు టీచర్లను క్రమబద్ధీకరిస్తే గానీ పూర్తిస్థాయిలో ఖాళీలు ప్రకటించే అవకాశం లేదు. జిల్లాలో మొదటి దశలో 364 స్కూళ్లను గుర్తించగా 281ఆదర్శ పాఠశాలలుగా అభివృద్ధి చేశారు. వాటిలో 83 స్కూల్స్ విలీనం అవుతున్నాయి. రెండో దశలో 198 స్కూళ్లను గుర్తిస్తే 92 ఆదర్శ పాఠశాలలుగా ఏర్పాటు అవుతాయి. వీటిలో 106 పాఠశాలలు విలీనం అవుతున్నాయి. మొత్తానికి 189 పాఠశాలలు మూసివేసేందుకు రంగం సిద్ధమైంది. ఇక మునిసిపల్ యాజమాన్యంలో 46 పాఠశాలలు గుర్తించగా 30 ఆదర్శ పాఠశాలలుగా అభివృద్ధి చేస్తుండగా వీటిలో 16 స్కూళ్లు విలీనం అవుతున్నాయి. ఒకేసారి పిల్లలు లేని స్కూళ్లను మూసివేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో దశల వారీగా తాళాలు వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.
టీచర్ల బదిలీల తకరారు
Published Wed, Aug 5 2015 1:35 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బీజేపీ అధికారంలోకి వస్తే భవిష్యత్ అంధకారం
మెట్ గాలాలో మెరిసిన అలియా.. చీరలో ఎంత అందంగా ఉందో..!(ఫోటోలు)
అభిమాని ఐఫోన్ బద్దలు కొట్టాడు.. గ్లౌవ్స్ గిఫ్ట్గా ఇచ్చాడు! వీడియో
విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా
టాలీవుడ్ హీరో కూతురి ప్రేమ పెళ్లి.. తేదీ ఫిక్స్!
వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి
ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్
చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన స్టార్ హీరో.. కారణమేంటి?
సోమవారాల్లో నలిగిన బట్టలే ధరించండి! సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement