ఇసుక రీచ్ల కేటాయింపుల విషయంలో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు.
ఇబ్రహీంపట్నం (విజయవాడ) : ఇసుక రీచ్ల కేటాయింపుల విషయంలో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. ఈ విషయం కృష్ణా జిల్లా గొల్లపూడి మండలంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాకు చెందిన టీడీపీ నేత పీతా శ్రీనివాసరావు.. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును కలసి తనకు కూడా ఓ ఇసుక రీచ్ను కేటాయించాలని కోరాడు.
అయితే దీనిని వ్యతిరేకించిన గొల్లపూడికి చెందిన స్థానిక టీడీపీ నేతలు పీతా శ్రీనివాసరావును చితకబాదినట్లు సమాచారం. అయితే ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు పోలీసులకు అందలేదు. కాగా దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.