అనంత కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్తత | Students Protest At Collectorate In Anantapur | Sakshi
Sakshi News home page

అనంత కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్తత

Jul 24 2017 1:45 PM | Updated on Nov 9 2018 4:46 PM

విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌ ముట్టడికి యత్నించిన ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జి చేశారు.

- ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు
 
అనంతపురం: విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌ ముట్టడికి యత్నించిన ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జి చేశారు. ఈ లాఠీచార్జిలో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా కలక్టరేట్‌ వద్ద సోమవారం ఉదయం విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
 
దీంతో పోలీసులు వారిపై లాఠీ ఝులింపించారు. దీంతో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. అందులో తొమ్మిదో తరగతి విద్యార్థి ఎర్రిస్వామి తలకు బలమైన గాయాలు కావడంతో వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement