శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ టికెట్లను బుధవారం మంజూరుచేశారు. ధనుర్మాసం బుధవారం సాయంత్రం పూర్తి కావడంతో గురువారం...
సాక్షి, తిరుమల: శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ టికెట్లను బుధవారం మంజూరుచేశారు. ధనుర్మాసం బుధవారం సాయంత్రం పూర్తి కావడంతో గురువారం వేకువజామున ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం కానుంది. బుధవారం ఉదయం విజయ బ్యాంక్లో కరెంట్ బుకింగ్ ద్వారా 75 టికెట్లను విక్రయించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి బుధవారం 6 గంటల సమయం పడుతోంది. సంక్రాంతి పండుగ కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం వేకువజాము నుండి సాయంత్రం 6 గంటల వరకు 36,282 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి 12 కంపార్ట్మెంట్లలో సర్వదర్శనం భక్తులు వేచి ఉన్నారు. కాగా కాలినడకన తిరుమలకు వచ్చిన భక్తులు 4 కంపార్ట్మెంట్లలో ఉన్నారు. వీరికి 3 గంటల దర్శనం సమయం పడుతోంది. గదులు సులభంగానే లభిస్తున్నాయి.