రాష్ట్రంలో పలుచోట్ల రోడ్డు ప్రమాదాలు | Several Road Accidents In Ap | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో పలుచోట్ల రోడ్డు ప్రమాదాలు

May 2 2018 12:15 PM | Updated on Oct 20 2018 6:19 PM

Several Road Accidents In Ap - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి :  రాష్ట్ర రహదారులు బుధవారం రక్తమోడాయి. వైఎస్సార్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా, మరో ఇరువురి పరిస్థితి విషమంగా ఉంది. 

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు సమీపంలోని గొల్లపల్లి వద్ద టాటా మ్యాజిక్‌ వాహనం బ్రిడ్జిని ఢీకొన్న ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆత్మకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఇక్కడికి సమీపంలోనే మరో ప్రమాదం చోటు చేసుకుంది. రావూరు మండలంలోని చిట్వేలి ఘూట్‌లో లారీ బోల్తా పడిన ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ఆ దారిలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

వైఎస్సార్‌ జిల్లా బద్వేలు మండలంలోని గుండరాజుపల్లె వద్ద ఆటో, స్కూటర్‌ ఢీకొన్న ఘటనలో స్కూటర్‌పై నడుపుతున్న వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌ నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement