సుంకలమ్మ ఆలయంలో చోరీ | robbery in sunkalamma temple in ananthpur distirict | Sakshi
Sakshi News home page

సుంకలమ్మ ఆలయంలో చోరీ

Aug 4 2015 1:48 PM | Updated on Aug 30 2018 5:27 PM

అనంతపురం జిల్లా పుట్లూరు మండలం చింతకుంట గ్రామంలో సుంకలమ్మ దేవాలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు.

పుట్లూరు: అనంతపురం జిల్లా పుట్లూరు మండలం చింతకుంట గ్రామంలో సుంకలమ్మ దేవాలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. సోమవారం రాత్రి ఆలయంలో చొరబడి హుండీ, అమ్మవారి వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున ఆలయం వద్దకు వెళ్లిన పూజారులు దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దోచుకున్న సొత్తు విలువ ఎంత అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement