నగల దుకాణాల్లో చోరీ | robbery in jewelry shops in rajahmundry | Sakshi
Sakshi News home page

నగల దుకాణాల్లో చోరీ

Oct 12 2015 11:55 AM | Updated on Aug 30 2018 5:27 PM

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరం కేవీఆర్ స్వామి రోడ్డులో గల నగల దుకాణాలలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోరీ జరిగింది.

రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరం కేవీఆర్ స్వామి రోడ్డులో గల నగల దుకాణాలలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోరీ జరిగింది. స్థానికంగా ఉండే వెంకట కృష్ణజువెలర్స్, శ్రీ లక్ష్మి గణపతి జువెలర్ వర్క్స్ దుకాణాల తాళాలు పగల గొట్టి 202 గ్రాముల బంగారం, 750 గ్రాముల వెండి ఎత్తుకెళ్లారు. పక్కనే ఉన్న మరో షాపులో చోరీ యత్నం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరుకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement