బ్యాంకు మేనేజర్ ఇంట్లో చోరీ | robbery at eluru in west godavari | Sakshi
Sakshi News home page

బ్యాంకు మేనేజర్ ఇంట్లో చోరీ

Oct 2 2015 1:17 PM | Updated on Aug 30 2018 5:27 PM

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం ఆదివారపు పేట పెన్షన్‌లైన్‌లో చోరీ జరిగింది.

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం ఆదివారపు పేట పెన్షన్‌లైన్‌లో చోరీ జరిగింది. స్థానికంగా ఉండే ఇండియన్ బ్యాంకు మేనేజర్ బీవీ సుగుణ దాస్ ఇంట్లో శుక్రవారం తెల్లవారుజామున ఈ చోరీ జరిగింది. ఇంట్లో అంతా నిద్రపోతుండగా దొంగ వెనక వైపు నుంచి చొరబడ్డాడు. అలికిడి కావడంతో బ్యాంకు మేనేజర్ కుమార్తె నిద్ర లేచింది. దొంగను చూసి అరవడంతో పరారయ్యాడు. ఇంట్లో ఉన్న రూ.లక్షన్నర నగదు, పదికాసుల బంగారు గొలుసు చోరీకి గురైనట్టు బాధితులు గుర్తించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement