‘ఎమ్మెల్యేలకు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇచ్చే ప్రసక్తే లేదు. గతేడాది ఇవ్వలేదు. ఈ ఏడాది ఇచ్చే అవకాశం లేదు.
సాక్షి, విశాఖపట్నం: ‘ఎమ్మెల్యేలకు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇచ్చే ప్రసక్తే లేదు. గతేడాది ఇవ్వలేదు. ఈ ఏడాది ఇచ్చే అవకాశం లేదు. ఆర్థిక పరిస్థితి గాడిలో పడే వరకు ఏసీడీపీ ఫండ్స్ కోసం ఏ ఎమ్మెల్యే ఎదురుచూడనవసరం లేదు’ అని రాష్ర్ట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తేల్చిచెప్పారు. ‘గతేడాది స్పెషల్ డెవలప్ ఫండ్స్ (ఎస్డీఎఫ్) ఇవ్వలేదు.
కానీ ఈ ఏడాది ఎస్డీఎఫ్ ఇచ్చాం. సీఎం వద్దే రూ.500 కోట్ల ఎస్డీఎఫ్ నిధులుంచాం..ఎమ్మెల్యేలు అత్యవసర పనుల కోసం వాడుకోవచ్చు. తనకున్న ప్రత్యేకాధికారాలతో సీఎం ఈ నిధులను ఏ నియోజకవర్గంలో ఏ అవసరం కోసమైనా వినియోగించుకునే అవకాశం ఉంది’అని చెప్పారు. విశాఖ జిల్లా ఇన్చార్జిగా తొలిసారి జిల్లాకు విచ్చేసిన యనమల ఆదివారం టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.డీడీఆర్సీ లను రద్దు చేశామన్నారు.