రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య | Man suicide in railway track at vijayawada | Sakshi
Sakshi News home page

రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

Mar 11 2016 11:49 AM | Updated on Nov 6 2018 7:56 PM

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ వద్ద గురువారం అర్ధరాత్రి రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

అనంతపురం : అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ వద్ద గురువారం అర్ధరాత్రి రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు శుక్రవారం ఉదయం ఆ విషయాన్ని గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని...  మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మృతుడు ధర్మవరం పట్టణానికి చెందిన నాగరాజు(55)గా పోలీసులు గుర్తించారు. మృతుడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. అప్పబాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడని వారు తెలిపారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement