ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు గవర్నర్ నరసింహన్తో సమావేశమయ్యారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు గవర్నర్ నరసింహన్తో సమావేశమయ్యారు. గతంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి గవర్నర్ కేటాయించిన భవనాలను అలాగే కొనసాగేలా చూడాలని కోరినట్టు కోడెల చెప్పారు.
రెండు సభలు సజావుగా జరగాలని కోరుకుంటున్నామని కోడెల అన్నారు. గురువారం జరిగిన భేటీలో తెలంగాణ స్పీకర్ ఒక ప్రతిపాదన చేశారని, తాము కూడా ప్రతిపాదనలను వారి ముందు ఉంచామని చెప్పారు. ఓ స్పష్టత వచ్చాక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ హాల్కు మరమ్మత్తులు చేయాల్సి ఉందని కోడెల్ తెలిపారు.