ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జేకే మహేశ్వరి

Justice JK Maheshwari Appointed As Chief Justice Of AP - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ జేకే మహేశ్వరిని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుతం ఆయన మధ్యప్రదేశ్‌ హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తిగా ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో సివిల్, క్రిమినల్‌ న్యాయవాదిగా ఆయన పనిచేశారు. 2005లో మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2008లో పూర్తిస్థాయి న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాజ్యాంగపరమైన కేసులు వాదించడంలో మహేశ్వరికి విశిష్ట అనుభవం ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top