శ్రీవారిని దర్శించుకున్న జాను చిత్ర యూనిట్

సాక్షి, చిత్తూరు : తిరుమల శ్రీవారిని జాను చిత్ర యూనిట్ దర్శించుకుంది. శనివారం రాత్రి అలిపిరి మెట్ల మార్గంలో నటి సమంత పాదయాత్ర ద్వారా తిరుమలకు చేరుకున్నారు. అనంతరం తిరుమలలో బసచేశారు. చిత్ర యునిట్ సభ్యులు హీరో శర్వానంద్, సమంత, దిల్ రాజు ఆదివారం ఉదయం వీఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అర్చకులు ఆశీర్వాదాలతోపాటు తీర్ధప్రసాదాలు అందజేశారు. జాను చిత్రం మంచి విజయం సాధించిందని నిర్మాత దిల్ రాజు అన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి