ఒంగోలు : ప్రజలకు మంచి చేయాలనే తాను ముఖ్యమంత్రిని కావాలనుకున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారమిక్కడ అన్నారు. ప్రకాశం జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు నియోజకవర్గాల సమీక్షలను ఆయన రెండోరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ నియోజకవర్గ కార్యకర్తలు, నేతలతో సమీక్ష నిర్వహించారు. చంద్రబాబు అబద్ధపు హామీలతో పాటు, టీడీపీ చేస్తున్న అరాచకాలను కలిసికట్టుగా ఎదిరిద్దామంటూ వారిలో ధైర్యం నింపారు.
రాష్ట్రవ్యాప్తంగా టీడీపీకి వచ్చిన మెజార్టీ కేవలం అయిదు లక్షల ఓట్లు అని వైఎస్ జగన్ అన్నారు. కడపలో వైఎస్ఆర్ సీపీకి వచ్చిన మెజార్టీ 5 లక్షల ఓట్లు అని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చూసినపుడు ఇది పెద్ద తేడా కాదని, చంద్రబాబు ఇచ్చినట్లుగా మనం కూడా రైతు రుణమాఫీ హామీ ఇచ్చి ఉంటే అంతకన్నా ఎక్కువ ఓట్లు వచ్చేవన్నారు. ముఖ్యమంత్రి కావాలన్న ఒకే ఒక్క కోరికతో అడ్డమైన అబద్ధాలు చెప్పిన ఘనత చంద్రబాబు నాయుడిదేనని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.
చంద్రబాబు మాటలు నమ్మి రైతులు మోసపోయారని వైఎస్ జగన్ అన్నారు. రుణాలు కట్టకపోవడం వల్ల రూ.14వేల కోట్ల అపరాధ రుసుం వారిపై పడిందన్నారు. మార్చిలోగా రూ.28వేల కోట్ల వడ్డీ భారం పడిందని, అయితే చంద్రబాబు కేవలం రూ.5వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆయన మండిపడ్డారు.
జాబు కావాలంటే...బాబు రావాలన్నారు, ఇప్పుడు బాబు వస్తే...ఉన్న జాబు పోయిందని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు మోసాలు, అబద్ధాలకు పచ్చ పత్రికలు కొమ్ము కాశాయని ఆయన అన్నారు. చంద్రబాబుకు లేనిది.. తనకు ఉన్నది ప్రజల ఆశీర్వాదమని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
'ప్రజలకు మంచి చేయాలనే సీఎం కావాలనుకున్నా'
Published Tue, Nov 25 2014 10:47 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement