
పుట్టింటి నుంచి డబ్బు తీసుకురాలేదని.. భార్యను కడతేర్చాడు
పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురాలేదని భార్యను హత్య చేసిన సంఘటన ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది...
ప్రొద్దుటూరు క్రైం: పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురాలేదని భార్యను హత్య చేసిన సంఘటన ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది. పట్టణ శివారులోని ప్రకాశ్నగర్లో ప్రసన్నకుమార్ అనే వ్యక్తి అతని భార్య తలా రిమేరీ నిద్రిస్తున్న సమయంలో బెల్ట్తో గొంతుకు బిగించి సోమవారం హత్య చేశాడు. మంగళవారం ఉదయం డీఎస్పీ పూజితా నీలం, సీఐ టీవీ సత్యనారాయణ సం ఘటనా స్థలానికి వెళ్లి మేరి మృతదేహాన్ని పరిశీలించారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీనివాసనగర్కు చెందిన ప్రసన్నకుమార్ పెయింటర్గా పని చేస్తున్నాడు. అతనికి 9 ఏళ్ల క్రితం ప్రకాశ్నగర్కు చెందిన మేరీతో వివాహమైంది. వారికి కీర్తి, నిస్సీ అనే కుమార్తెలతో పాటు ఆండ్రూ జోయెల్ అనే కుమారు డు ఉన్నాడు. ఏడాదినర్ర క్రితం ప్రసన్నకుమార్ తమ సంసారాన్ని ప్రకాశ్నగర్లోని అత్తగారింటికి మార్చాడు.
పథకం ప్రకారమే హత్య..
ప్రసన్నకుమార్కు మద్యం తాగే అలవాటు ఉంది. అ తను ఇటీవల చాలా మంది వద్ద నుంచి అప్పుగా డ బ్బు తీసుకున్నాడు. వారు బాకీ చెల్లించమని అతనిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ప్రసన్న కుమార్ తన పుట్టింటి నుంచి డబ్బుతీసుకుని రమ్మని భార్యతో చెప్పగా ఆమె నిరాకరించింది. దీంతో ఆమెను హతమార్చాలని అత ను భావించాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి భోజనం చేసిన అతను త్వరగానే నిద్రపోయాడు. ప్రతిరోజు పెద్ద కుమార్తె కీర్తి వారి వద్దనే పడుకునేది.
అయితే కుమార్తెను ప్రసన్నకుమార్ తమ తల్లి వద్ద వదలి వచ్చాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఇంట్లో నుంచి టీవీ సౌండ్ ఎక్కువగా బయటికి వినిపిస్తోంది. కొద్ది సేప టి తర్వాత మేరి గట్టిగా కేకలు వేయసాగింది. అయితే అది గమనించిన ఆమె అన్న మహేష్ పరుగెత్తుకుంటూ వెళ్లి తలుపును బలంగా కొట్టి తెరిచి చూడగా అప్పటికే మేరి కింద పడి ఉంది. ఆమె మెడకు బెల్ట్ కూడా ఉంది. వెంటనే ఆమెను ఆటోలో జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా ఆమె అప్పటికే మృతి చెంది నట్లు వైద్యులు తెలిపారు. మంగళవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.