5 నుంచి హెడ్ పోస్టాఫీసుల్లో టీటీడీ దర్శనం టికెట్లు | Head office TTD 5 Preview Tickets | Sakshi
Sakshi News home page

5 నుంచి హెడ్ పోస్టాఫీసుల్లో టీటీడీ దర్శనం టికెట్లు

Jan 3 2015 7:44 AM | Updated on Sep 2 2017 7:10 PM

ఈనెల ఐదో తేదీ నుంచి రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రధాన తపాలా కార్యాలయూల్లో టీటీడీ దర్శ నం టికెట్ల విక్రయూలు జరుపుతామని చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ బీవీ సుధాకర్ తెలిపారు.

గాంధీనగర్ : ఈనెల ఐదో తేదీ నుంచి రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రధాన తపాలా కార్యాలయూల్లో టీటీడీ దర్శ నం టికెట్ల విక్రయూలు జరుపుతామని చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ బీవీ సుధాకర్ తెలిపారు. స్థానిక తపాలా కార్యాలయంలో ‘పిడికెడు బియ్యం’ పథకం కింద పోస్టల్ సిబ్బంది సేకరించిన బియ్యాన్ని శుక్రవారం ఆయన నగరంలోని వృద్ధాశ్రమానికి అందజేశా రు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రలో 56, తెలంగాణలోని 39 ప్రధాన తపాలా కార్యాలయూల్లో టికెట్లు అందుబాటు లో ఉంటాయని చెప్పారు. జనవరి 25 నాటికి పోస్టాఫీసుల్లో క్యాష్‌లెస్ సర్వీసెస్ అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. దీనిద్వారా బ్యాంకులు, ఏటీఎంలు అందుబాటులో లేనిచోట పోస్టాఫీసుల ద్వారా రూ. వెయ్యిలోపు నగదు చెల్లింపులు చేయవచ్చన్నారు. ఇందుకోసం అన్ని పోస్టాఫీసుల్లో స్వైపింగ్ యంత్రాలు ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు.

ఈ-కామర్స్ వంటివి కూడా ఈ ఏడాదే అందుబాటులోకి వస్తాయన్నారు. సామాజిక బాధ్యత కింద ‘పిడికెడు బియ్యం’ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. సిబ్బంది నిత్యం తమ ఇళ్లల్లో పిడికెడు బియ్యాన్ని ఈ పథకానికి కేటాయిస్తారని, నెలాఖరున నిరుపేదలకు అందజేస్తారన్నారు. భవిష్యత్తులో పోస్టల్ డిపార్ట్‌మెంట్‌ను ఆధునికీకరిస్తామన్నారు. గాంధీనగర్ పోస్టాఫీస్ సిబ్బంది సేకరించిన 50 కేజీల బియ్యాన్ని కానూరులోని సీనియర్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ సంపత్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement