'టీడీపీ నేతల పొలాల్లోనే సర్వేలు చేస్తున్నారు' | gannavaram farmers meets to ys jagan over problems | Sakshi
Sakshi News home page

'టీడీపీ నేతల పొలాల్లోనే సర్వేలు చేస్తున్నారు'

Jan 19 2017 10:57 AM | Updated on Jul 25 2018 4:42 PM

'టీడీపీ నేతల పొలాల్లోనే సర్వేలు చేస్తున్నారు' - Sakshi

'టీడీపీ నేతల పొలాల్లోనే సర్వేలు చేస్తున్నారు'

పంట నష్టపరిహారంలో అధికారులు వివక్ష చూపుతున్నారని రైతులు వైఎస్‌ జగన్‌ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.

కృష్ణా : పంట నష్టపరిహారంలో అధికారులు వివక్ష చూపుతున్నారని కృష్ణా జిల్లా రైతులు వైఎస్‌ జగన్‌ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనను బాపులపాడు, గన్నవరం మండలాల రైతులు కలిశారు.

మినుము పంటకు తెగుళ్లు సోకి తీవ్రంగా నష్టపోయామని రైతులు జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. పరిహారం కోసం చేసిన సర్వేలో అధికారులు వివక్ష చూపుతున్నారని...కేవలం అధికార పార్టీ నేతల పొలాల్లోనే సర‍్వే చేస్తున్నారన్నారు. ఏలూరు కాల్వ కింద శివారు భూములకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు జగన్‌కు తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమస్యలను పరిష్కారించేందుకు కృషి చేస్తామని వైఎస్‌ జగన్‌ రైతులకు హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement