యనమలతో ఉద్యోగ సంఘాల భేటీ | employees union meets yanamala | Sakshi
Sakshi News home page

యనమలతో ఉద్యోగ సంఘాల భేటీ

Jan 13 2015 5:16 PM | Updated on Aug 27 2018 8:44 PM

మంత్రి మండలి ఉపసంఘంతో భేటీ అయిన ఉద్యోగసంఘాల నేతలు - Sakshi

మంత్రి మండలి ఉపసంఘంతో భేటీ అయిన ఉద్యోగసంఘాల నేతలు

హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ నివేదికపై ఉద్యోగ సంఘాలతో మంత్రి వర్గ ఉప సంఘం భేటీ అయింది.

హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ నివేదికపై ఉద్యోగ సంఘాలతో మంత్రి వర్గ ఉప సంఘం భేటీ అయింది. అయితే చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను మంత్రి వర్గానికి తెలియజేశాయి. ఉద్యోగుల కనీస వేతనం రూ. 15 వేలుగా నిర్ధారించాలని ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశాయి. ఒక్కో కుటుంబంలోని నలుగురు సభ్యులను ఒక్కో యూనిట్ గా గుర్తించాలని కోరాయి.

ఉద్యోగుల ఇంక్రిమెంట్ రేటు 3 శాతానికి పెంచాలని డిమాండ్ చేశాయి. అయితే సంబంధిత శాఖకు చెందిన నలుగురు మంత్రులు సమావేశానికి హాజరు కాలేదు.  వారు వచ్చిన తరువాత  డిమాండ్లపై చర్చిస్తామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement