కరోనాను జయించిన వారు 8,008 మంది

Corona tests near to 10 lakh mark in AP - Sakshi

ఏపీలో ఇంకా యాక్టివ్‌ కేసులు 9,473

10 లక్షల మార్కుకి చేరువలో కరోనా పరీక్షలు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 8,000 దాటింది. ఆస్పత్రుల నుంచి శనివారం 376 మంది డిశ్చార్జ్‌ కావడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8,008కి చేరింది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 వరకు మొత్తం 24,962 మందికి పరీక్షలు నిర్వహించడం ద్వారా మొత్తం పరీక్షలు 9,96,573కి చేరాయి. రాష్ట్రంలో కొత్తగా 765 మందికి పాజిటివ్‌గా తేలినట్టు వైద్యారోగ్యశాఖ శనివారం బులెటిన్‌లో పేర్కొంది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు 17,699కి చేరాయి. కొత్తగా మరో 12 మంది మృతితో మొత్తం మరణాల సంఖ్య 218కి చేరింది. యాక్టివ్‌ కేసులు 9,473 ఉన్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top