ఏపీలో 23కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు | Corona Positive Cases Rises To 23 In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో 23కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

Mar 30 2020 10:24 PM | Updated on Mar 31 2020 12:12 AM

Corona Positive Cases Rises To 23 In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం మరో ఇద్దరికి కరోనా సోకినట్టుగా నిర్ధారణ అయిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఏపీలో ఇప్పటివరకు 23 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌రెడ్డి సోమవారం సాయంత్రం హెల్త్‌ బులిటెన్‌ విడుద చేశారు. ఈ రోజు 68 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఇద్దరికి పాజిటివ్‌గా తేలిందన్నారు. కరోనా పాజటివ్‌గా తేలినవారిలో ఒకరు ఢిల్లీ నుంచి వచ్చిన రాజమండ్రికి చెందిన 72 ఏళ్ల వృద్దుడు కాగా, ఇంకొకరిని ఢిల్లీ నుంచి సామర్లకోటకు వచ్చిన 49 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement