‘108’లోనే తరలించాలి | collector says 108 used for pregnants | Sakshi
Sakshi News home page

‘108’లోనే తరలించాలి

Dec 21 2013 4:57 AM | Updated on Oct 9 2018 6:34 PM

ప్రతి ప్రసూతి కేసులో గర్భిణిని 108 అంబులెన్స్‌లోనే ఆస్పత్రికి తరలించాలని వైద్యాధికారులు, సిబ్బందిని కలెక్టర్ ప్రద్యుమ్న ఆదేశించారు. శుక్రవారం సీపీఓ కార్యాలయంనుం చి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, సిబ్బందితో ప్రసూతి కేసులపై సమీక్షించారు.

కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రతి ప్రసూతి కేసులో గర్భిణిని 108 అంబులెన్స్‌లోనే ఆస్పత్రికి తరలించాలని వైద్యాధికారులు, సిబ్బందిని కలెక్టర్ ప్రద్యుమ్న ఆదేశించారు. శుక్రవారం సీపీఓ కార్యాలయంనుం చి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, సిబ్బందితో ప్రసూతి కేసులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యాధికారులకు, సిబ్బం దికి పలు అంశాల్లో లక్ష్యాలు నిర్దేశించామని, మూడు నెలలవుతున్నా వాటిని చేరుకోలేద ని పేర్కొన్నారు. లక్ష్యాలు అర్థం కాలేదా అని ప్రశ్నించారు. లక్ష్యాలను పూర్తి చేయాల్సిన బాధ్యత వైద్యాధికారులు, ఏఎన్‌ఎం లు, ఆశావర్కర్లపై ఉందన్నారు.
 
 పసూతి కోసం గర్భిణిని 108 వాహనంలోనే ప్రాథమిక, ఏరియా, జిల్లా ఆస్పత్రులకు తరలిం చాలని, ఈ విషయాన్ని రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు. సిజేరియన్, సీరి యస్ కేసుల్లో గర్భిణి బంధువులు కోరితే ప్రైవేట్ ఆస్పత్రులకు పంపించాలన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో 42 శాతమే డెలివరీలు జరుగుతున్నాయని, ఈ శాతా న్ని పెంచాలని ఆదేశించారు. లక్ష్యాలను నిర్లక్ష్యం చేసేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఎంహెచ్‌ఓ గోవింద్ వాగ్మారే, సీపీఓ నబీ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement