రెవెన్యూశాఖదే గురుతర బాధ్యత | Revenue officers massively responsibility | Sakshi
Sakshi News home page

రెవెన్యూశాఖదే గురుతర బాధ్యత

Sep 7 2013 2:52 AM | Updated on Oct 9 2018 6:34 PM

పేదలకు అతి దగ్గరగా ఉండే రెవెన్యూశాఖ ఇతర శాఖలకంటే సమాజంలో గురుతర బాధ్యత నిర్వహిస్తోందని కలెక్టర్ టి.చిరంజీవులు అన్నారు.

కలెక్టరేట్, న్యూస్‌లైన్ : పేదలకు అతి దగ్గరగా ఉండే రెవెన్యూశాఖ ఇతర శాఖలకంటే సమాజంలో గురుతర బాధ్యత నిర్వహిస్తోందని కలెక్టర్ టి.చిరంజీవులు అన్నారు. క్షేత్ర స్థాయి ఉద్యోగులందరూ అకింత భావంతో విధులు నిర్వహించినప్పుడే ప్రజలకు మేలు చేయగలుగుతామని చెప్పారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం ఆర్డీఓలు, తహసీల్దార్‌లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
 
  ప్రతి వారం వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ముఖ్యమైన అంశాలను సమీక్షిస్తామని చెప్పారు. గ్రీవెన్స్‌డేలో భూమి సమస్యలు, తగాదాలు , రేషన్‌కార్డు అర్జీలు ఎక్కువగా వస్తున్నందున, సమస్యలు త్వరగా పరిష్కరించాలన్నారు. గ్రీవెన్స్‌డేలో అందిన ప్రతి అర్జీకి రశీదు ఇవ్వాల న్నారు. ఇసుక అక్రమ రవాణాను  అరికట్టాలని ఆదేశిం చారు. ఎన్‌ఎఫ్‌బీఎస్ స్కిమ్‌కు సంబంధించి ప్రతిపాదనలు పంపాలని చెప్పారు. ఉద్యోగుంతా స్థానికంగా నివాసం ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. విద్యారంగానికి అధిక ప్రాధాన్యం విద్యా ప్రమాణాలు మెరుగుపర్చడానికి చర్యలు తీసుకోవాలని  కోరారు. అక్టోబర్ నుంచి నగదు బదిలీ పథ కం ప్రారంభం అవుతుందుని, డీబీటీ ఆధార్ నమోదు కార్యక్రమం త్వరగా పూర్తి చేయించాలని  కోరారు.

జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్ మాట్లాడుతూ మీసేవ సర్వీసులలో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో ఉందని, 222 మీసేవ కేంద్రాలు పనిచేస్తున్నాయని చెప్పారు. జమాబంది 46 మండలాల్లో పూర్తయిందని, మిగతా మండలాల్లో 15వ తేదీ లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. వినాయక చవితి నుం చి ఈ మాసాన్ని కొలతల మాసంగా ప్రకటించి భూముల కొలతలు, సర్వే పనులను వేగవంతం చేయాలన్నారు.  ఈ సమావేశంలో ఇన్‌చార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి ఆర్.అంజయ్య, ఆర్డీఓలు జహీర్, శ్రీనివాస్‌రెడ్డి, నాగన్న, సురేందర్‌బాబు, ప్రసాదరావు, జిల్లా పౌరసరఫరాల అధికారి నాగేశ్వర్‌రావు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement