నాగార్జున సాగర్ నీటి విడుదల పంచాయితీ ఎట్టకేలకు గవర్నర్ నరసింహన్ వద్దకు చేరింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ శనివారం ఉదయం రాజ్భవన్లో గవర్నర్ సమక్షంలో భేటీ అయ్యారు.
హైదరాబాద్ : నాగార్జున సాగర్ నీటి విడుదల పంచాయితీ ...గవర్నర్ నరసింహన్ వద్దకు చేరింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ శనివారం ఉదయం రాజ్భవన్లో గవర్నర్ సమక్షంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు హరీష్ రావు, దేవినేని ఉమతో పాటు ఇరు రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున సాగర్ జలవివాదంపై చర్చిస్తున్నారు.
నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద శుక్రవారం ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణపై తెలంగాణ సీఎం కేసీఆర్కు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడారు. కాగా ఈ జల వివాదంపై కేంద్రం ఆరా తీసినట్లు సమాచారం. సాగర్ వద్ద ఘర్షణకు దారితీసిన పరిస్థితులపై కేంద్ర జలవనరుల శాఖ, కేంద్ర హోంశాఖ అధికారులు తెలంగాణ రాష్ట్ర అధికారులకు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది.