హిందూపురం అర్బన్ : నిషేధిత క్యాట్ ఫిష్ (చేపలు) ను యథేచ్ఛగా పెంచుతూ అందినకాడికి సొమ్ము చేసుకుంటున్నారు కొందరు అక్రమార్కులు. మాంసం వ్యర్థాలు ఆరగించే ఈ చేపలను తిన్నవారు అనారోగ్యం బారిన పడతారని వైద్యులు హెచ్చరించడంతో ప్రభుత్వం వాటి పెంపకాన్ని నిషేధించింది. అరుుతే ఈ రకం చేపలు రుచిగా ఉంటాయనే కారణంతో కొన్ని ప్రాంతాల్లో వీటికి మంచి డిమాండ్ ఉంది. ఈ చేపలను తినకూడదనే విషయం చాలా మంది నిరక్షరాస్యులకు తెలియదు. ఇదే అదనుగా కొందరు అక్రమార్కులు హిందూపురం పట్టణ శివారులో కొంత కాలంగా వీటిని పెంచుతూ.. బెంగళూరు, ముంబరుుకి యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
తూమకుంట పారిశ్రామికవాడలోని బ్రిటిష్ పెయింట్స్ తయారీ కంపెనీ వెనుక భాగంలో ఈతతంగం సాగిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తే పెద్దపెద్ద చేపల చెరువులు కనిపిస్తాయి. గద్దలు, పక్షులు వాలకుండా చెరువుపై వలలు కప్పారు. మధ్యలో చనిపోయిన గద్దలను వేలాడదీసి ఉంచారు. ఇలా వేలాడుతున్న గద్దలను చూస్తే.. మిగతా పక్షులు అక్కడ వాలవనేది వారి ఆలోచన. ఇక్కడ ఐదు చెరువుల్లో క్యాట్ ఫిష్ పెంచుతున్నారు. మరిన్ని చెరువులను సిద్ధం చేస్తున్నారు.
పట్టు పురుగులు, కుళ్లిన చికెన్
హిందూపురం పరిసర ప్రాంతాల్లో పట్టు పరిశ్రమ వేళ్లూనుకుంది. దీంతో పట్టు రీలర్ల ద్వారా పట్టుగూళ్ల నుంచి దారం తీసి వ్యర్థంగా ఉన్న పురుగులను క్యాట్ ఫిష్ పెంపకం నిర్వాహకులు సేకరిస్తున్నారు. వీటితో పాటు చికెన్ షాపుల వద్ద మిగిలిపోరుున వ్యర్థాలను తెప్పించుకుంటున్నారు.
బెంగళూరు సమీపంలోని కోళ్ల ఫారాలతో మృతి చెందిన వాటిని ప్రత్యేక ఆటోల్లో ఇక్కడకు దిగుమతి చేసుకుని చేపలకు ఆహారంగా వేస్తున్నారు. ఈ చేపలను పెంచుతున్న చెరువుల వద్ద భరించలేనంతగా దుర్వాసన వస్తోంది. గాలి గట్టిగా వీచినపుడు సమీప కాలనీల్లోకి సైతం దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు, ముంబాయి ప్రాంతాల్లోని పలు హోటళ్లలో చేప మాంసానికి ఎక్కువ డిమాండ్ ఉంది. మాములు చేపలు అయితే క్వింటాలు రూ.15 వేల నుంచి రూ.16వేలు దాకా ఉన్నారుు.
క్యాట్ ఫిష్ అరుుతే క్వింటాలు రూ.12 వేలే ఉండటం వల్ల హోటళ్ల యాజమానులు వీటిని కొంటున్నారు. ఇవి ఏ రకం చేపలో తెలియని కస్టమర్లు సైతం ఇదే చేప మాంసం కావాలని అడుగుతున్నారని ఓ హోటల్ యజమాని చెప్పారు. క్యాట్ ఫిష్ మాంసం తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అరుునప్పటికీ వీటి పెంపకానికి తక్కువ ఖర్చు, ఎక్కువ లాభం ఉండటంతో కొందరు వ్యక్తులు మాఫియూగా ఏర్పడి ఈ దందా నడుపుతున్నారు. ఇటీవలి కాలంలో ఈ చేపలను అనంతపురం, ధర్మవరం, గుంతకల్లు, తాడిపత్రి, హిందూపురం ప్రాంతాల్లోని హోటళ్లకు కూడా పంపుతున్నారని విశ్వసనీయంగా తెలిసింది. క్యాట్ ఫిష్ పెంపకం వ్యవహారం స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులకు తెలిసినా పట్టించుకోక పోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
క్యాట్ ఫిష్.. హెల్త్ ఫినిష్!
Published Sat, Dec 6 2014 3:23 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement