మహబూబ్నగర్ జిల్లా బొంరాస్పేట మండలం నాగిరెడ్డిపల్లి వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోగా ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు.
కారు బోల్తా..ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
Jun 3 2016 10:47 PM | Updated on Apr 3 2019 7:53 PM
కొడంగల్ : మహబూబ్నగర్ జిల్లా బొంరాస్పేట మండలం నాగిరెడ్డిపల్లి వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోగా ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. హైదరాబాద్ బంజారాహిల్స్కు చెందిన రాహుల్ బంగ్యా, తమ కుటుంబ సభ్యులతో కలసి శుక్రవారం ఉదయం కారులో కర్ణాటక రాష్ట్రం గాన్గాపూర్లోని దత్తాత్రేయస్వామి ఆలయానికి వెళ్లి సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు. వారి కారు నాగిరెడ్డిపల్లి వద్ద ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించబోయి రోడ్డు పక్క గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో రాహుల్ భార్య స్వాతి (45) అక్కడికక్కడే చనిపోయింది. రాహుల్తోపాటు ఆయన తల్లి నాన్యా, బంధువు మంగళ పింపొడే తీవ్రంగా గాయపడ్డారు. వారిని కొడంగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement