సొమ్ముతో వరుడు పరార్..వధువు ఆత్మహత్యయత్నం! | Bride attempt suicide, as groom Flees in Chittoor | Sakshi
Sakshi News home page

సొమ్ముతో వరుడు పరార్..వధువు ఆత్మహత్యయత్నం!

Sep 4 2014 4:42 PM | Updated on Aug 13 2018 3:11 PM

వరుడు చేసిన నిర్వాకం కారణంగా వధువు ఆత్మాహత్యాయత్నానికి పాల్పడింది

చిత్తూరు: వరుడు చేసిన నిర్వాకం కారణంగా వధువు ఆత్మాహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలం యానాదిబెట్టులో చోటు చేసుకుంది. వరుడు రాజారాం 2 లక్షల రూపాయల కట్నం, మూడున్నర తులాల బంగారంతో ఉడాయించాడు. 
 
వరుడి నిర్వాకంపై వధువు కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన తట్టుకోలేక వధువు ఆత్మహత్యకు ప్రయత్నించిందని ఆమె బంధువులు తెలిపారు. వధువు పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement