వైఎస్సార్ కడప జిల్లా నుంచి పారిపోయిన ఓ బాలుడు శనివా రం కంచిలికి చేరాడు.
వైఎస్సార్ కడప జిల్లా నుంచి పారిపోయిన ఓ బాలుడు శనివా రం కంచిలికి చేరాడు. స్థానిక చైల్డ్లైన్ సంస్థ సిబ్బంది శనివారం పిల్లవాడిని చేరదీసి ఇచ్ఛాపురం పోలీసులకు అప్పగించారు. చైల్డ్లైన్ కోఆర్డినేటర్ జాస్మిన్ కుమారి తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని రామయ్యపట్నంకి చెంది న కృష్ణారావు, భూలోకమ్మలు వారి కుమారుడు సలోమాన్ను వైఎస్సార్ కడప జిల్లాలో ఎర్రగుంట్ల మండలం, చిప్పలూరు గ్రామంలో ఒక పాస్టర్ వద్ద ఉంచి చదివిస్తున్నారు.
సలోమాన్ అక్కడ జడ్పీ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. అక్కడ ఉండలేక ఈ నెల 5న తప్పించుకుని వచ్చేశాడు. సలోమాన్ కనపడటంలేదని పాస్టర్ అక్కడ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారు 1098 ద్వారా అన్ని చైల్డ్ లైన్ కేంద్రాలకు సలోమాన్ ఫొటో, ఇతర వివరాలు పంపారు.
కడప నుంచి కంచిలి రైల్వేస్టేషన్కు చేరుకున్న సలోమాన్ అక్కడ నుంచి తన తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. విషయం తెలుసుకున్న చైల్డ్లైన్ అధికారులు కంచిలి వెళ్లి అ బాలుడిని తీసుకొచ్చి శనివారం పట్టణ పోలీసుస్టేషన్లో బాలుడి తండ్రి సమక్షంలో పట్టణ ఎస్సై కె.వాసునారాయణకు అప్పగించారు.