సభకు అనుమతి సరికాదు: జీవన్‌రెడ్డి | APNGOs House is not allowed: Jeevan Reddy | Sakshi
Sakshi News home page

సభకు అనుమతి సరికాదు: జీవన్‌రెడ్డి

Sep 5 2013 3:23 AM | Updated on Sep 4 2018 5:07 PM

హైదరాబాద్‌లో ఈ నెల 7న ఏపీఎన్జీవోల సభ నిర్వహణకు అనుమతించి, అదే రోజు తెలంగాణ జేఏసీ తలపెట్టిన ర్యాలీకి అనువుతించకపోవడం తెలంగాణ వారిని రెచ్చగొట్టడమే అవుతుందని కాంగ్రెస్ సీనియుర్ నాయుకుడు, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు.

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఈ నెల 7న ఏపీఎన్జీవోల సభ నిర్వహణకు అనుమతించి, అదే రోజు తెలంగాణ జేఏసీ తలపెట్టిన ర్యాలీకి అనువుతించకపోవడం తెలంగాణ వారిని రెచ్చగొట్టడమే అవుతుందని కాంగ్రెస్ సీనియుర్ నాయుకుడు, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో, సీఎల్పీ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించకుండా ప్రభుత్వం ఈ సభకు అనుమతి ఇచ్చిందని,  ఏపీ ఎన్జీవోల సభ సందర్భంగా ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. సభకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలన్నారు.
 
  సమైక్యాంధ్రకోసం ఉద్యమం జరుగుతున్న విజయవాడ లేదా, గుంటూరులో ఏపీ ఎన్జీవోలు సభ పెట్టుకునే వీలుందన్నారు. ఉద్యోగుల సభకు హైదరాబాద్‌లో అనుమతి ఇచ్చినప్పుడు తెలంగాణవాదుల ర్యాలీకి అనుమతి ఇవ్వడం సముచితవుని, దీనిపై ముఖ్యమంత్రి  దృష్టిని సారించాలని అన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం(యుూటీ)గా చేయాలని చెబుతున్న వారు ప్రజాస్వామ్య పాలన ను కోరుకుంటున్నారో, అధికారుల పాలన కావాలనుకుంటున్నారో తేల్చి చెప్పాలన్నారు. హైదరాబాద్ మొత్తం అభివృద్ధి చేసింది నేనే అని చెప్పుకుంటున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుుడు,.. హైదరాబాద్‌లో తాను చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement