కొనసాగుతున్న ఎన్‌జీఓల దీక్షలు | AP NGOs Strike for Samaikyandhra | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న ఎన్‌జీఓల దీక్షలు

Feb 12 2014 2:23 AM | Updated on Sep 2 2017 3:35 AM

సమైక్యాంధ్రకు మద్దతుగా కలెక్టరేట్ ఎదుట ఎన్‌జీఓలు. రెవెన్యూ ఉద్యోగులు చేస్తున్న దీక్షలు మంగళవారం కూడా కొనసాగాయి.

విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా కలెక్టరేట్ ఎదుట ఎన్‌జీఓలు. రెవెన్యూ ఉద్యోగులు చేస్తున్న దీక్షలు మంగళవారం కూడా కొనసాగాయి. ఒకవైపు కార్యాలయాల్లో విధులను అడ్డుకుంటూనే...దీక్షా శిబిరాన్ని కొనసాగిస్తున్నారు. త్యాగాలు చేసి అయినా సమైక్యాంధ్రను కాపాడుకుంటామని స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రొంగలి ఎర్రన్నాయుడు మాట్లాడుతూ ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా రాష్ట్రాన్ని విడదీయాలని చూడడటం దుర్మార్గమన్నా రు. కొన్ని పార్టీల నాయకులు ద్వంద్వ ప్రమాణాలు అవలంభించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.     ఇప్పటికైనా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా సమైక్య వాణి విన్పించాలన్నారు. కాగా దీక్షలకు విశాలాంధ్ర మహా సభ నాయకలతో పాటు పలు ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు.  
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement