ఆర్టీసీ వీలీనంపై వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం

AP Government Appointed Working Group On APSRTC Merging - Sakshi

సాక్షి, అమరావతి : ఏపీఎస్‌ఆర్టీసీ వీలీనంపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. విలీన ప్రక్రియ పూర్తి చేసేందుకు వర్కింగ్‌ గ్రూప్‌ను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ  వర్కింగ్‌ గ్రూప్‌లో ఆర్థిక, సాధారణ పరిపాలన, రవాణా, న్యాయశాఖకు చెందిన ఏడుగురు అధికారులు ఉన్నారు. ప్రజా రవాణాశాఖ, పోస్ట్‌లు, డిజిగ్నేషన్ల ఏర్పాట్లపై ఈ వర్కింగ్‌ గ్రూప్‌ దృష్టి  సారించనుంది. జీతాల చెల్లింపులు, పేస్కేల్‌ వంటి అంశాల్లో విధివిధానాలు ఖరారు చేయనున్నారు. వచ్చే నెల 15నాటికి పూర్తి నివేదిక ఇవ్వాలని వర్కింగ్‌ గ్రూప్‌కు ప్రభుత్వం ఆదేశించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top