సీఎం వైఎస్‌ జగన్‌: ఆర్టీసీ వీలీనంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం | AP Govt Appointed Special Working Group to Merge APSRTC - Sakshi
Sakshi News home page

ఆర్టీసీ వీలీనంపై వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం

Oct 24 2019 9:16 PM | Updated on Oct 25 2019 11:28 AM

AP Government Appointed Working Group On APSRTC Merging - Sakshi

సాక్షి, అమరావతి : ఏపీఎస్‌ఆర్టీసీ వీలీనంపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. విలీన ప్రక్రియ పూర్తి చేసేందుకు వర్కింగ్‌ గ్రూప్‌ను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ  వర్కింగ్‌ గ్రూప్‌లో ఆర్థిక, సాధారణ పరిపాలన, రవాణా, న్యాయశాఖకు చెందిన ఏడుగురు అధికారులు ఉన్నారు. ప్రజా రవాణాశాఖ, పోస్ట్‌లు, డిజిగ్నేషన్ల ఏర్పాట్లపై ఈ వర్కింగ్‌ గ్రూప్‌ దృష్టి  సారించనుంది. జీతాల చెల్లింపులు, పేస్కేల్‌ వంటి అంశాల్లో విధివిధానాలు ఖరారు చేయనున్నారు. వచ్చే నెల 15నాటికి పూర్తి నివేదిక ఇవ్వాలని వర్కింగ్‌ గ్రూప్‌కు ప్రభుత్వం ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement