ప్రారంభమైన ఏపీ కేబినేట్‌ సమావేశం | AP Cabinet Meeting Started In Amaravati | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన ఏపీ కేబినేట్‌ సమావేశం

Sep 4 2019 11:08 AM | Updated on Sep 4 2019 1:58 PM

AP Cabinet Meeting Started In Amaravati - Sakshi

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినేట్‌ బుధవారం సమావేశమైంది. ఈ సమావేశంలో కేబినేట్‌ పలు కీలకమైన నిర్ణయాలను తీసుకోనుంది. ఏపీఎస్‌ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు మంత్రి మండలి ఆమోదముద్ర వేయనుంది. రేపటినుంచి అమల్లోకి రానున్న కొత్త ఇసుక పాలసీ విధానంపై కేబినెట్ చర్చించనుంది. ఇసుక సరఫరా ధరపై నిర్ణయం, టీటీడీ పాలకమండలి సభ్యులను 19 నుంచి 25కు పెంపుపై చర్చ జరిగే అవకాశం ఉంది. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న నాణ్యమైన రేషన్ బియ్యం సరఫరాపై చర్చ జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement