ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ ఆడిటింగ్ రిపోర్ట్ను సభలో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై సుదీర్ఘంగా సభలో చర్చించనున్నారు. అనంతరం ఫిస్కల్ పాలసీ స్టేట్మెంట్ను కూడా సభలో ప్రవేశపెట్టనున్నారు. దీనితో పాటు ఏపీ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ మెనిటరీ అథారిటీ బిల్లుపై సభలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. నేటితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి.