అరకు (విశాఖపట్టణం) : విశాఖ జిల్లాలో అధికారులు పెద్దమొత్తంలో గంజాయిని పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం మధ్యాహ్నం బొర్రా జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా హుకుంపేట నుంచి గంజాయిని తరలిస్తున్న లారీ పట్టుబడింది. అందులోని 312 ప్యాకెట్లలో ఉన్న సుమారు 424 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారంతా వరంగల్ జిల్లాకు చెందినవారుగా భావిస్తున్నారు. గంజాయిని లారీ సహా సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై యు.నాగేశ్వరరావు తెలిపారు.
విశాఖలో భారీగా గంజాయి పట్టివేత
Published Mon, Jul 11 2016 3:16 PM
Advertisement
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
Advertisement