ట్రాక్టర్, కారు ఢీ.. ముగ్గురికి గాయాలు | 3 injured in road accident at tirupathi | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్, కారు ఢీ.. ముగ్గురికి గాయాలు

Aug 6 2015 1:43 PM | Updated on Aug 30 2018 3:56 PM

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి.

ఏర్పేడు: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం పాతవీరాపురం గ్రామంలో గురువారం జరిగింది. హైదరాబాద్‌కు చెందిన నలుగురు ఉద్యోగులు కారులో కానిపాకం నుంచి శ్రీకాళహస్తి వెళ్తుండగా ముసిలిపేడు ఇసుక రీచ్‌ నుంచి తిరుపతికి ఇసుక తీసుకెళ్తున్న ఓ ట్రాక్టర్ వీరాపురం సమీపంలో ఢీకొట్టింది.

దీంతో కారులో ఉన్న సెక్షన్ ఆపీసర్ బిక్షం(49), అసెంబ్లీ ఉద్యోగి మల్లికార్జున శర్మ(46), పార్ధసారధి(46)లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను తిరుపతి ఆస్పత్రికి తరలించారు.  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement