
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.
నిన్న (మంగళవారం) 69,214 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 26,599 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.27 కోట్లుగా లెక్క తేలింది.
- తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
విశ్వహిందూ పరిషద్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్
విశ్వహిందూ పరిషద్ రాష్ట్ర కార్యదర్శి తనికెళ్ళ రవి కుమార్
విశ్వహిందూ పరిషద్ జనరల్ సెక్రటరీ రాఘవలు
టీ టీ డి పాలకమండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి