మరి కొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్-11 సీజన్ కోసం ఆటగాళ్లంతా ప్రాక్టీస్లో మునిగిపోయారు. రెండేళ్ల తర్వాత పునరాగమనం చేస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సైతం నెట్స్లో తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడు. అయితే ప్రాక్టీస్ మధ్యలో అభిమానులను కలుస్తూ సందడి చేస్తున్నాడు ఈ మాజీ కెప్టెన్.